Kurnool: ఆదోనిలో అగ్నిప్రమాదం.. రూ.8.8 కోట్ల నష్టం..!

by Vemula.Srinu Prasad |

కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది....

Kurnool: ఆదోనిలో అగ్నిప్రమాదం.. రూ.8.8 కోట్ల నష్టం..!
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kuranool)లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదోని(Adhoni)లోని పత్తి మిల్లు(Cotton Mill)లో మంటలు ఎగిసిపడ్డాయి. అందరూ చూస్తుండగా పత్తి, పత్తిబేళ్లు మంటల్లో దహనమయ్యాయి. మంటలార్పే ప్రయత్నం చేసిన ఫలించలేదు. మిల్లు మొత్తం మంటలు వ్యాపించి కాలిపోయింది. విషయం తెలుసుకున్న ఫైర్ మంటలార్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అంచనా వేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మిల్లు వద్ద నిలిపిన రెండు సైతలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో రూ. 8.8 కోట్ల విలువైన నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.

Next Story