ఫౌంటేన్ నీళ్లతో బట్టలు ఉతికిన మహిళ!.. ఇందుకే డెవలెప్ చేయనని చెప్పేది (వీడియో)

by Disha Web Desk 5 |
ఫౌంటేన్ నీళ్లతో బట్టలు ఉతికిన మహిళ!.. ఇందుకే డెవలెప్ చేయనని చెప్పేది (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫౌంటేన్ నీళ్లతో ఓ మహిళ బట్టలు ఉతికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లోని నిడదవోలులో నగర అభివృద్దిలో భాగంగా ఏపీ పర్యాటక శాఖ గణేశ్ చౌరస్తాలో వాటర్ ఫౌంటేన్ నిర్మించారు. అయితే దీని వద్ద ఓ మహిళ బట్టలు ఉతుకుతూ కనిపించింది. ఒక పక్క ఫౌంటెన్ ను చూడటానికి వచ్చిన పర్యాటకులు ఫోటోలు దిగుతుండగా.. మరోపక్క ఈ ఫౌంటేన్ లోని నీళ్లతో మహిళ బట్టలను వాష్ చేస్తుండటం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పాపం రోడ్డు మధ్యలో చెరువు కట్టించారు అనుకుంటున్నట్లుంది అని, ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా ఫౌంటెన్ కట్టిస్తే ఇలాగే ఉంటుందని, ఇందుకే కాబోలు జగన్ మామయ్య రాష్ట్రాన్ని డెవలెప్ చేయకుండా డబ్బులు పంచుతున్నాడు అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.


Next Story

Most Viewed