చంద్రబాబును పట్టుకుని బోరున విలపించిన మహిళ

by Disha Web Desk 21 |
చంద్రబాబును పట్టుకుని బోరున విలపించిన మహిళ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసిన ఓ మహిళ తీవ్ర భావోద్వేగానికి గురైంది. చంద్రబాబు నాయుడును గట్టిగా పట్టుకుని విలపించింది.చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన తీరును తలచుకుని కన్నీటి పర్యంతమైంది. మరోవైపు ఆమె ఉద్వేగాన్ని చూసి చంద్రబాబు నాయుడు సైతం భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు ఆ మహిళను దగ్గరకు తీసుకుని మాట్లాడారు. ఆమెను ఓదార్చారు. ఇకపై భవిష్యత్‌లో అంతా మంచే జరుగుతుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీవారి దర్శనం అనంతరం వాహనం దగ్గరకు వెళ్తున్న చంద్రబాబును చూసేందుకు అక్కడ ఉన్న భక్తులు ఉత్సాహం చూపారు.చంద్రబాబు అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. కాన్వాయ్ వెళుతున్న మార్గంలో పెద్ద ఎత్తున గుమికూడిన భక్తులు, ప్రజలు చంద్రబాబుకు అభివాదం చేశారు.


Next Story

Most Viewed