వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం... పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణోత్సవం వైభంగా జరుగుతోంది. ఈ ఉత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. స్వామి అమ్మవారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు..

వైభవంగా సీతారాముల కల్యాణోత్సవం... పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణోత్సవం(Ontimitta Kodanda Ramaswamy) వైభంగా జరుగుతోంది. ఈ ఉత్సవంలో సీఎం చంద్రబాబు(Cm Chandrababu) దంపతులు పాల్గొన్నారు. స్వామి అమ్మవారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం కల్యాణోత్సవం కార్యక్రమం ప్రారంభమైంది. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. మొత్తం 120 గ్యాలరీలు నిండిపోయాయి. ఈ మేరకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఒంటిమిట్ట ఆలయంలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. ఆలయం నుంచి కల్యాణ వేదిక వద్దకు శోభయాత్ర కాసేపట్లో ప్రారంభంకానుంది.

Next Story