- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Simhachalam: ఆ కుటుంబంలో తీరని విషాదం.. సింహాచలం ఘటనలో తల్లి, భార్య, మేనత్త సహా యువకుడి దుర్మరణం
సింహాచలంలో గోడకూలిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని (Tragedy) నింపింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: సింహాచలంలో గోడకూలిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని (Tragedy) నింపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఈ దుర్ఘటనలో చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని పత్తి దుర్గాస్వామినాయుడు(32), ఎడ్ల వెంకట్రావు(48), ఈశ్వరశేషు(28) గా గుర్తించారు. ఇదే దుర్ఘటనలో పిల్లా మహేష్(30) అతని భార్య శైలజ(29), ఆమె తల్లి వెంకకటరత్నం(45), మేనత్త జి.మహాలక్ష్మి (65) మృతి చెందినట్లు చెబుతున్నారు. మధురవాడ చంద్రన్న పాలెంలో మహేశ్, శైలజ నివాసం ఉంటున్నారు. శైలజ ఇన్ఫోసిస్సిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది. మహేశ్ హెచ్సీఎల్లో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.
Next Story






