- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ex Minister Balineni: ఒంగోలుకు రావల్సిన టైం వచ్చింది.. బాలినేని హాట్కామెంట్స్
ఒంగోలుకు రావలసిన టైం వచ్చిందంటూ మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి హాట్కామెంట్స్చేశారు

దిశ, డైనమిక్ బ్యూరో : ఒంగోలుకు రావలసిన టైం వచ్చిందంటూ మాజీ మంత్రి, జనసేన నాయకులు బాలినేని శ్రీనివాసులు రెడ్డి హాట్కామెంట్స్చేశారు. ఈ రోజు ఉదయం ఆయన హైదరాబాద్నుంచి ఒంగోలుకు చేరుకున్నారు. ఆయనకు ఇంటివద్ద కార్యకర్తలు, అభిమా నులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరేం చేసుకున్నా నన్ను నమ్ముకున్న కార్యకర్తలను వదిలిపెట్టను, నా మనుషులను నేను కాపాడుకుంటా.. ఒంగోలు రావాల్సిన టైం వచ్చింది ఇక అవసరమైతే 24గంటలు ఒంగోలులోనే ఉంటానన్నారు.. నా మనుషులకోసం ఏమైనా చేస్తాన్నన్నారు. రిగ్యులర్గా ఒంగోలుకు (Ongole) వస్తారా.. అని విలేకరులు ప్రశ్నించగా.. వచ్చే టైం అయింది వస్తా.. అన్నారు. బాలినేని చేసి న కామెంట్స్ఇప్పుడు హాట్హాట్గా మారాయి. గతంలో వైసీపీ (YCP) ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన బాలినేని మారిన సమీకరణలతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేన పార్టీలో (Janasena) చేరారు. ఆ సమయంలో తాను బేషరతుగా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఒంగోలులో వైసీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధనరావు (Damacharla) వర్సెస్బాలినేని శ్రీనివాసరావు అన్నట్లు రాజకీయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో బాలినేని కొంతకాలం హైదరా బాద్లో ఉంటూ స్తబ్దుగా ఉండిపోయారు. ఈ రోజు ఒంగోలుకు వచ్చిన ఆయన రావలసిన టైం వచ్చిందంటూ కామెంట్స్చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.






