లోకేశ్‌ కృషికి దక్కిన ఫలితం.. 12 ఏళ్ల తరువాత సరికొత్త రికార్డు

by Vemula.Srinu Prasad |

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్‌ పట్టుదల, కృషితో ఇంటర్‌ మీడియట్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా.. అధికారులు, నిపుణుల సూచనలు–సలహాలతో రూపొందించిన ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నిరంతరం పర్యవేక్షించారు...

లోకేశ్‌ కృషికి దక్కిన ఫలితం.. 12 ఏళ్ల తరువాత సరికొత్త రికార్డు
X

దిశ, ఏపీ బ్యూరో: విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్‌ పట్టుదల, కృషితో ఇంటర్‌ మీడియట్‌లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా.. అధికారులు, నిపుణుల సూచనలు–సలహాలతో రూపొందించిన ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ నిరంతరం పర్యవేక్షించారు. లక్ష్యానికి చేరుకున్నారు. తన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇంటర్‌ ఫలితాల రూపంలో కనిపించే సరికి యన మోములో విజదదరహాసం మెరిసింది.

మంత్రి కృషితో 12 ఏళ్ల తరువాత..

ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ఫలితాలు 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యుత్తమ ఫలితాలు వచ్చాయి. విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్‌ చేపట్టిన సంస్కరణలు, అమలుచేసిన ప్రణాళికల వల్లే మెరుగైన ఫలితాలు వచ్చాయని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు..

+మొదటి సంవత్సరం 77% ఉత్తీర్ణత. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం.

+రెండవ సంవత్సరం 81% ఉత్తీర్ణత. ఇది గత 12 ఏళ్లలో రెండవ అత్యుత్తమ ఫలితం.

ప్రభుత్వ నిర్వహణలోని విద్యాసంస్థల్లో..

+మొదటి సంవత్సరం 66% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలోనే రికార్డు సృష్టించాయి.

+రెండవ సంవత్సరం 76% ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండవ ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి.

సంక్షేమం–సంస్కరణలు..

ఇప్పటివరకూ హైస్కూలు విద్యార్థులకే అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంను ఇంటర్‌ విద్యార్థులకూ అమలు చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పథకం కింద విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు, పోటీ పరీక్షల మెటీరియల్, సైన్స్‌ ప్రాక్టికల్‌ రికార్డులు/మాన్యువల్స్‌ను పంపిణీ చేశారు. ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్‌ పోస్టులను అర్హులైన జూనియర్‌ లెక్చరర్లకు పదోన్నతులతో భర్తీ చేశారు. బోధనా సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను గెస్ట్‌ ఫ్యాకల్టీతో భర్తీ చేసి, బోధనకు అంతరాయం లేకుండా చూశారు.

ప్రణాళిక– పర్యవేక్షణ..

జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు పకడ్బందీగా యూనిట్‌ టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ, ప్రీ–ఫైనల్‌ పరీక్షలను కేంద్రీకృత పద్ధతిలో నిర్వహించారు. పరీక్షా ఫలితాలను డ్యాష్‌బోర్డ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, విద్యార్థుల మార్కుల ఆధారంగా టీచర్ల పనితీరును ప్రతి నెలా సమీక్షించారు. కళాశాల పని వేళలను ఉదయం 9:30 నుంచి 9 గంటలకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మార్చారు.

‘సంకల్పం – 2026’ (50 రోజుల విజయ ప్రణాళిక)..

విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో ఇంకా మెరుగు కావాలో గుర్తించి ఆ దిశగా శిక్షణ అందించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను రూపొందించి పంపిణీ చేశారు.

తీసుకున్న చర్యలు..

కేర్‌ టేకర్‌ వ్యవస్థ ద్వారా ప్రతి జూనియర్‌ లెక్చరర్‌ కనీసం 10 మంది విద్యార్థులను దత్తత తీసుకుని, వారి హాజరు, ఫలితాల బాధ్యతను స్వీకరించారు. విద్యార్థుల సంక్షేమం చూస్తూనే ఇందులో తల్లిదండ్రుల భాగస్వామ్యం పెంపొందించారు. జూనియర్‌ కాలేజీల్లో ఏడాదికి రెండుసార్లు మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగులు నిర్వహించి.. పిల్లల ప్రగతిని వివరించే ప్రోగ్రెస్‌ కార్డులను అందజేశారు. డిజిటల్‌ కనెక్టివిటీతో సత్ఫలితాలు సాధించారు. సిలబస్‌ పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయడానికి క్లాస్‌ వారీగా వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కొత్త ప్రశ్నపత్రం విధానం ప్రవేశపెట్టడం వల్ల, వారు అన్ని సబ్జెక్టులలో అత్యధిక స్కోరు సాధించడానికి మంచి అవకాశం ఏర్పడింది.

Next Story