మద్యం కేసులో నిందితులకు బిగ్ షాక్.. గడువు పొడిగింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-13 11:16:08  IST  )

మద్యం కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది...

మద్యం కేసులో నిందితులకు బిగ్ షాక్.. గడువు పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: నకిలీ మద్యం కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగించారు. విజయవాడ జిల్లా జైలులో ఉన్న రిమాండ్‌ ఖైదీలను వర్చువల్‌గా ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి నిందితులకు ఈ నెల 25 వరకు రిమాండ్‌ పొడిగించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు, విజయవాడ ఇబ్రహీంపట్నం వద్ద నకిలీ మద్యం తయారు చేస్తున్న కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రావుతో పాటు మాజీ మంత్రి జోగి రమేశ్, పలువురిని అరెస్ట్ చేసి వివిధ జైళ్లకు తరలించారు. వీరి రిమాండ్ గడువు ముగియడంతో జడ్జి విచారణ జరిపారు. ఈ నెల 25 వరకు గడువు పొడిగిస్తున్నట్లు ఆదేశించారు.

Next Story