ఏపీ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం.. ఈసీ అధికారిక ప్రటకన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-11 10:44:48  IST  )

ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ..

ఏపీ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం.. ఈసీ అధికారిక ప్రటకన
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. రాజ్యసభలో ఖాళీ అయిన నాలుగు స్థానాలకు టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరిని ఆయా పార్టీ అధిష్టానాలు ఖరారు చేశాయి. దీంతో టీడీపీ అభ్యర్థులు చింతకాలయ విజయ్, భాష్యం రామకృష్ణ, సానా సతీశ్, జనసేన నుంచి లింగమనేని రమేశ్ నామినేషన్ దాఖలు చేశారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ఎలాంటి నామినేషన్లు నమోదు కాకపోవడంతో వీరు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు. ఇందుకు సంబంధించిన పేపర్లను వారికి అందజేశారు. దీంతో అభ్యర్థుల అనుచరులు స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు.

Next Story