Atrocious: అనంతపురంలో దారుణం.. వృద్దురాలు హత్య కలకలం..

by Disha Web Desk 3 |
Atrocious: అనంతపురంలో దారుణం.. వృద్దురాలు హత్య కలకలం..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించమని అడిగినందుకు వృద్ధురాలిని ముక్కలు ముక్కలుగా నరికి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా లోని గార్లదిన్నె మండంలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన కృష్ణ మూర్తి అనే వ్యక్తి తన ఇంట్లో శుభకార్యం ఉందని అదే గ్రామానికి చెందిన ఓబులమ్మ అనే వృద్దురాలిని నగలు అడిగారు.

శుభకార్యానికి నగలు అడగం, పైగా ఒకే ఊరు కావడంతో ఓబులమ్మ తన దగ్గర ఉన్న 7 తులాల బంగారు నగలను కృష్ణ మూర్తికి ఇచ్చింది. అయితే రోజులు గడుస్తున్నా కృష్ణమూర్తి ఆ నగలను ఊసెత్తలేదు. అప్పటికే నగలు తీసుకుని 15 రోజులు గడవడంతో ఓబులమ్మ స్థానికులను ఆశ్రయించింది. దీనితో ఆగ్రహానికి గురైన కృష్ణ మూర్తి, తన కుటుంబంతో కలిసి ఆ వృద్ధురాలిని ఊరి పొలిమేరకు తీసుకువెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చంపారు.

కాగా స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాగా ఓబులమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అలానే శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed

    null