CM Chandrababu: ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం

by Thanuru Gopichand |

ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.

CM Chandrababu: ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) సూచించారు.అవినీతి (Corruption) ఒక జబ్బులాంటిదని, దానిని పూర్తిగా నిర్మూలించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరును ఈ రోజు ముఖ్యమంత్రి సమీక్షించారు. లబ్ధిదారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రెవెన్యూ, ఆలయాలు, మున్సిపల్​శాఖలో సేవలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యదాలు వస్తున్న విభాగాల్లో ఉద్యోగులకు కౌన్సిలింగ్​ఇప్పించాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో జరిగిన రివ్యూ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రి అనగాని సత్యప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Next Story