Breaking news: ఎన్నికలకు సంసిద్దమవుతున్న జనసేన.. జోనల్ వారీగా కమిటీలు

by Disha Web Desk 3 |
Breaking news: ఎన్నికలకు సంసిద్దమవుతున్న జనసేన.. జోనల్ వారీగా కమిటీలు
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన చేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ కూడా రానున్న ఎన్నికలకు సంసిద్దమవుతోంది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాలు, సభలు సజావుగా సాగేలా చర్యలు తీసుకునేందుకు జనసేన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. కాగా ఈ కమిటీలను జోనల్ వారీగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేశారు.

ఈ రోజు పవన్ కళ్యాణ్ గోదావరి, రాయలసీమ 1, రాయలసీమ 2 ఉత్తరాంధ్ర, సెంట్రల్ ఆంధ్ర జోన్లుగా కమిటీలను ఏర్పాటు చేశారు. కాగా ఈ కమిటీల్లో కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులు ఉంటారు. అలానే లీగల్, డాక్టర్‌ సెల్స్ తరఫున సభ్యులు కూడా ఉంటారు. ఈ నేపథ్యంలో జోనల్ కమిటీలు రానున్న ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక జోనల్ కమిటీలతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ రేపు భేటీ కానున్నారు.

Read More..

వంగవీటి రాధా టార్గెట్‌గా వాట్సప్ మెసేజ్‌లు.. విజయవాడ సెంట్రల్‌లో కలకలం..



Next Story

Most Viewed