టీటీడీకి భారీ విరాళం.. ఎంతంటే?

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-26 11:25:33  IST  )

తిరుమల(Tirumala) శ్రీవేంకశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు

టీటీడీకి భారీ విరాళం.. ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) శ్రీవేంకశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుని.. భక్తి శ్రద్ధలతో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కలు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో పలువురు భక్తులు(Devotees) టీటీడీ(TTD) ట్రస్టులకు విరాళాలు కూడా అందజేస్తారు.

ఈ నేపథ్యంలో తాజాగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వై.వి.ఎస్.ఎస్ భాస్కరరావు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్, దాని ఇతన అనుబంధ ట్రస్టులకు రూ.3 కోట్ల విలువైన ఆస్తిని, రూ.66 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్లాను విరాళంగా ఇచ్చారు. ఈ ఆస్తి హైదరాబాద్‌ సమీపంలోని ఆనంద నిలయం అనే 3,500 చదరపు అడుగుల భవనం. శ్రీ వెంకటేశ్వర స్వామి పై భాస్కరరావుకు ‘అపారమైన విశ్వాసం, భక్తి’ ఉంటాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story