యురేనియం సమస్య లేదు: తురకపాలెం ఘటనపై వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

తురకపాలెం నీటిలో యురేనియం సమస్య లేదని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది....

యురేనియం సమస్య లేదు: తురకపాలెం ఘటనపై వైద్యారోగ్య శాఖ కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తురకపాలెం(Turakaplem) వాసులు తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాంతంలోని నీరు, మట్టిలో యురేనియం(Uranium) ఉందని ప్రచారం జరిగింది. అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ తురకపాలెం నీటిని, మట్టిని పరీక్షించారు. ఈ పరీక్షఅనంతరం వైద్యారోగ్య శాఖ(Health Department) కీలక ప్రకటన చేసింది. నీటి శాంపిల్స్ ఫలితాల్లో యురేనియం పరిమిత స్థాయిలోనే ఉందని తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే స్థాయిలోయురేనియం అవశేషాలు లేవని స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. తురకపాలెంలో యురేనియం సమస్యలేదని వైద్యా రోగ్య శాఖ తెలిపింది. ఇక గ్రామంలో వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

Next Story