ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. గడువు పెంచిన ప్రభుత్వం

by Vemula.Srinu Prasad |

ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. గడువు పెంచిన ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉద్యోగుల బదిలీల(Ap Employees Transfers) వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 16 నుంచి జూన్ 2 వరకు ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న విషయం తెలిసిందే. అర్హతలపై ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. జూన్ 2 దగ్గరికి వచ్చిన నేపథ్యంలో గడువు పెంచాలని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఉద్యోగుల బదిలీల గడువును వారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Next Story