రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు.. రూ. 8 కోట్లు విడుదల

by Vemula.Srinu Prasad |

స్మార్ట్ రేషన్ కార్డుల తయారీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది...

రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డులు.. రూ. 8 కోట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రేషన్ కార్డుల(Ration Cards)కు సంబంధించి సరికొత్త మార్పులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు(Smart Ration Cards) పంపిణీ చేశారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఈ విధానాన్నే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, ఇందుకు అయ్యే ఖర్చును భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.46 కోట్ల స్మార్ట్ రేషన్ కార్డులు ముద్రించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రూ. 8 కోట్లు మంజూరు చేసింది. ఒక్కో స్మార్ట్ కార్డు తయారీకి రూ. 4.66 ఖర్చు అవుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story