అమరావతి రైతులకు గుడ్ న్యూస్..ఖాతాల్లో రూ. 163.67 కోట్లు జమ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-23 12:48:35  IST  )

అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది...

అమరావతి రైతులకు గుడ్ న్యూస్..ఖాతాల్లో రూ. 163.67 కోట్లు జమ
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. కౌలు డబ్బులు విడుదల చేసింది. రూ. 163.67 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది. 18 వేల 726 మంది రైతులకు ఈ డబ్బులు విడుదల చేసినట్లు సీఆర్డీఏ తెలిపింది. 88 వేల మంది రైతులకు టెక్నికల్ కారణాలతో విడుదల కాలేదని, సంబంధిత బ్యాంకులకు వివరాలు అందజేయాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది.

కాగా రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి కోసం అప్పటి ప్రభుత్వం భూములు సేకరించిన విషయం తెలిసిందే. అయితే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు నివాస స్థలాలు, వాణిజ్య స్థలాలను కేటాయించింది. రాజధాని పూర్తి అయ్యే వరకూ కౌలు చెల్లిస్తామని ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ ఏపీ ప్రభుత్వం 11 సార్లు కౌలు అందజేసింది.

Next Story