చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత పథకం అమలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-15 15:22:10  IST  )

చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది....

చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత పథకం అమలు
X

దిశ, వెబ్ డెస్క్: చేనేత కార్మికుల(Handloom workers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఉచిత విద్యుత్ పథకం(Free electricity scheme)పై అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాన్ని ఆమోదించిందని, ఆర్థిక శాఖ(Finance Department) పెండింగ్‌లో ఉంచొద్దని ఆదేశించారు. త్వరలోనే ఈ పథకాన్నిఅమలు చేయాలని సూచించారు. ప్రతి నెల మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గానికి 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అమలు చేయాలని ఆదేశించారు.

ఈ పథకం అమలుతో చేనేత కుటుంబాలకు ఊరట లభించనుంది. చేనేత పరిశ్రమకు పునర్జీవం పోసే అవకాశం ఉంది. అలాగే గ్రామీణ ఉపాధి అవకాలు కూడా పెరుగుతాయని పలువురు నిపుణులు అంటున్నారు. చూడాలి మరి.

Next Story