- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ జర్నలిస్టులకు ముఖ్య గమనిక.. అక్రిడిటేషన్ కార్డుల గడువు పెంపు
by Vemula.Srinu Prasad |
ఏపీ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ జర్నలిస్టుల(Ap Journalists) అక్రిడిటేషన్ కార్డుల(Accreditation cards) గడువు ఈ నెల 31తో ముగుస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని మరో మూడు నెలలు పాటు పొడిగించింది. ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు శ్రీ హిమాన్షు(Shri Himanshu) శుక్ల తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పాత్రికేయుల అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితి ఆగస్టు 31తో ముగుస్తోందని, సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే నూతన అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ వరకు ఈ పొడిగింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. అప్పటివరకూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు.
Next Story






