- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DCM:‘ఆ తప్పిదానికి పరిష్కారం చూపిన రోజు ఇదే’.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు

దిశ,వెబ్డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్కు ఇచ్చిన ప్రత్యేక హోదాను ఆగస్టు, 05, 2019న భారత ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయం తీసుకుని 6 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో "ఆర్టికల్ 370 రద్దు దినోత్సవం" సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జమ్మూ & కాశ్మీర్ మరియు లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో నేడు(ఆగస్టు 5) ఒక చారిత్రాత్మక రాజ్యాంగ తప్పిదానికి పరిష్కారం చూపిన రోజు అని పేర్కొన్నారు. సరిగ్గా ఆరు సంత్సరాల క్రితం జమ్మూ & కాశ్మీర్ భారత యూనియన్లో పూర్తిగా మరియు న్యాయబద్ధంగా ఏకీకరణకు హామీ ఇచ్చిందని తెలిపారు.
చాలా కాలంగా అశాంతి, హింసతో ప్రభావితమైన ఆ ప్రాంతాలకు శాంతిని తీసుకువచ్చిన రోజుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలకు వృద్ధి, సమానత్వం మరియు అభివృద్ధికి మార్గాన్ని తెరిచి.. దేశ నిర్మాణంలో నిర్ణయాత్మక మరియు దార్శనిక నాయకత్వం యొక్క బలాన్ని చూపించింది అన్నారు. ఈ క్రమంలో ‘‘ఆగస్టు 5, 2019న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో NDA ప్రభుత్వం, ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా, కాశ్మీర్లో దశాబ్దాల అశాంతిని ముగించి, దేశవ్యాప్తంగా పౌరులతో సమానంగా చారిత్రాత్మక అడుగు వేసింది. దశాబ్దాలుగా, ఉగ్రవాదం మరియు హింస కాశ్మీర్ యువత ఆకాంక్షలను అణచివేశాయి. ఆర్టికల్ 370 రద్దు శాంతియుత మరియు ప్రగతిశీల భవిష్యత్తు పై ఆశ, స్థిరత్వం, వాగ్దానాన్ని తెచ్చిపెట్టింది’’ అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా గుర్తు చేశారు.






