- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వల్లభనేని వంశీపై భూమి కబ్జా కేసు.. సోమవారం తీర్పు

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Former MLA Vallabhaneni Vamsi)పై భూమి కబ్జా కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వంశీని కస్టడీ(Custody)కి ఇవ్వాలని విజయవాడ కోర్టు(Vijayawada Court)లో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా ఆత్కూరు(Krishna district Atkur)లో వల్లభనేని వంశీ 8 ఎకరాల భూమిని కబ్జా చేశారని, ఈ కేసులో మరింత లోతుగా విచారించాలని పిటిషన్లో దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ధర్మాసనం ఎదుట ఇరువర్గాలు వాదనలు వినిపించారు. కస్టడీకి ఇవ్వాలని అటు పోలీసులు.. బెయిల్ ఇవ్వాలని ఇటు వంశీ తరపున వాదనలు కొనసాగాయి. దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆ రోజే తీర్పు ఇస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. దీంతో వల్లభనేనికి కోర్టు బెయిల్ ఇస్తుందా..?, లేదా పోలీస్ కస్టడీకి అనుమతిస్తుందా అనే ఉత్కంఠ అనుచరుల్లో నెలకొంది.
కాగా వల్లభనేని వంశీ రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడుపుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, వ్యక్తి కిడ్నాప్నకు యత్నం, తదితర కేసుల్లో కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ను జైలులో ఉంచారు. ఈ రెండు కేసులేకాక మరికొన్ని కేసుల్లోనూ వల్లభనేని వంశీ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసుల్లోనూ విచారణ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో భూమి కబ్జా కేసుకు సంబంధించి సోమవారం తీర్పు రాబోతోంది. చూడాలి మరి ఎలాంటి తీర్పు వస్తుందో..?.