ఏపీలో 120 గ్రామాలకు గుడ్ న్యూస్.. 4జీ సౌకర్యం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం

by Vemula.Srinu Prasad |

ఏపీలో 120 గ్రామాలకు 4జీ సౌకర్యం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది...

ఏపీలో 120 గ్రామాలకు గుడ్ న్యూస్.. 4జీ సౌకర్యం కల్పిస్తూ కేంద్రం నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో నెట్ వర్క్ లేని గ్రామాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. డిజిటల్ భారత్ నిధి(Digital India Fund) కింద 4జీ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం సైతం సహకరించింది. దీంతో అనంతపురం, చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కర్నూలు, పల్నాడు, నెల్లూరు, సత్యసాయి, శ్రీకాకుళం జిల్లాల్లో ముందుగా నెట్ వర్క్ సేవలు అందించనున్నారు. ఇందుకోసం టెలికాం శాఖ(Telecom Department) రూ. 120 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrasekhar) వెల్లడించారు. ఆయా గ్రామాల్లో నెట్ వర్క్ పనులను ఏడాదిలోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్రం పని చేస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు.

Next Story