పోస్టుమార్టం పూర్తి.. స్వస్థలాలకు కాశీబుగ్గ మృతదేహాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-01 13:15:07  IST  )

తొక్కిసలాట మృతులకు పోస్టుమార్టం పూర్తి కావడంతో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు..

పోస్టుమార్టం పూర్తి.. స్వస్థలాలకు కాశీబుగ్గ మృతదేహాలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి(Kasibugga Venkateswaraswamy) ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే 9 మంది మృతదేహాలకు పలాస ప్రభుత్వ ఆస్పత్రి(Palasa Government Hospital)లో పోస్టుమారం పూర్తి అయింది.


అనంతరం ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు మృతదేహాలను తరలిస్తున్నారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో బాలుడు సహా 9 మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందించారు. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతి చెందిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తామని స్పష్టం చేశారు.

Next Story