ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

by Dishafeatures2 |
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానానికి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే కడప-అనంతపురం-కర్నూలు స్థానానికి నగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నానికి పీవీఎన్‌ మాధవ్‌ను ఎంపిక చేసింది. అయితే మిగిలిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరగనున్నాయి. మార్చి 16న ఫలితాలు వెల్లకానున్నాయి.

Next Story

Most Viewed