రేపు ఏపీలో వేడుకలు.. సడెన్‌గా కీలక మార్పు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-11 12:58:19  IST  )

ఏపీ ప్రభుత్వ ఏడాది పాలన కార్యక్రమ వేదికను మార్పు చేసింది..

రేపు ఏపీలో వేడుకలు.. సడెన్‌గా కీలక మార్పు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విజయవంతంగా సంవత్సరం పాటు కూటమి పాలన(Coalition rule) సాగింది. దీంతో ఏపీ వ్యాప్తం(AP wide)గా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుపరిపాలన, స్వర్ణాంధ్ర(Suparipalana, Swarnandra) పేరుతో ఈ వేడుకలు జూన్ 12న సాయంత్రం నిర్వహించాలని పిలుపునిచ్చింది. దీంతో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన వేదికను మంగళగిరి(Mangalagiri) ఇండోర్ స్టేడియంలో సిద్ధం చేశారు. అయితే ప్రభుత్వం సడెన్‌గా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమం వేదిక మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. విజయవాడలోని ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్‌లో వేడుకలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story