అసంబద్ధ పీఆర్సీని రద్దు చెయ్యాలి.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

by Web Desk |
అసంబద్ధ పీఆర్సీని రద్దు చెయ్యాలి.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
X

దిశ, ఏపీ బ్యూరో: సీపీఎస్ రద్దు చేయాలని, మెరుగైన పిఆర్సీ అమలు చేయాలని, అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ( FAPT0 ) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. భారీగా ఉపాధ్యాయులు కలెక్టరేట్ల వద్దకు చేరుకోవడంతో కొన్ని కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాల మోహరింపు. ముఖ్యంగా తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు కొందరు ఉపాధ్యాయ నేతల ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

Next Story

Most Viewed