అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది..

అంబేద్కర్ విగ్రహానికి నిప్పు.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: అంబేద్కర్(Ambedkar) విగ్రహానికి నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా(Chittoor District)లో జరిగింది. జీడీ నెల్లూరు మండలం దేవళంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలకు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మద్దతుపలికారు. ఈ ఘటనపై సీఎంవో కార్యాలయంతో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పూతలపట్టు, నెల్లూరు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలు సౌతం ఆరా తీశారు. స్థానిక ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకుని నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి డిమాండ్ చేశారు.

Next Story