తెలుగు ప్రజలకు సకల శుభాలు కలగాలి: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-26 15:08:06  IST  )

వినాయక చవితికి తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి...

తెలుగు ప్రజలకు సకల శుభాలు కలగాలి: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: వినాయక చవితి(Vinayaka Chavitha)కి తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. వేలాది గణపతులు(Ganapathulu) పూజలు అందుకునేందుకు ముస్తాబయ్యారు. వివిధ రూపాల్లో ఉన్న గణపతులు ఇప్పటికే మండపాల్లో కొలువుతీరారు. బుధవారం ఉదయం నుంచి 9 రోజులు పాటు గణనాథులు పూజలందరుకోనున్నారు.

దీంతో తెలుగు ప్రజల(Telugu People)కు సీఎం చంద్రబాబు(cm Chandrababu) వినాయక చవితి(Vinayaka Chavitha) శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నా. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నా.’’ అని చంద్రబాబు తెలిపారు.

Next Story