టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం!

by Disha Web Desk 14 |
టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పి.గన్నవరం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు మహాసేన మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. ‘కులరక్కసి చేతిలో మరొక్కసారి బలైపోయాను.. జగన్ రెడ్డి.. గుర్తుపెట్టుకుంటాను.. నాకోసం నా పార్టీని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, లోకేష్‌నీ ఎవ్వరూ తిట్టొద్దు.. నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను’ అని స్పష్టం చేశారు.

కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ పార్టీ మీదకి తీసుకోస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ వైసీపీ పార్టీ పై ఆరోపణలు చేశారు. మా వర్గాలు ఎప్పుడు బాగుపడాలి.. ప్రశ్నించే వారు ఉండొద్దు.. అని వైసీపీపై విమర్శించారు. ప్రశ్నించే వారికి చంద్రబాబు అసెంబ్లీ టికెట్ ఇస్తే.. పోటీ చేయనీయకుండా వ్యవస్థతో అడ్డుకుంటున్నారని చెప్పారు. తనను హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నారని, పార్టీకి చెడ్డపేరు రావొద్దని, అందుకోసమే పోటీ నుంచి తప్పుకోవడం మంచిదని చెప్పారు.

Read More..

ఆ సీటు నాకే వస్తుంది.. జనసేన నేత కందుల దుర్గేశ్ కీలక వ్యాఖ్యలు

Next Story

Most Viewed