ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమ దందాను కళ్లారా చూశా: లోకేష్

by Disha Web Desk 2 |
ఎమ్మెల్యే కేతిరెడ్డి అక్రమ దందాను కళ్లారా చూశా: లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ధర్మవరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెట్టారు. ‘‘ధ‌ర్మవ‌రం క్యాంప్ సైట్ వ‌ద్దకి వ‌చ్చిన తొగ‌ట వీర క్షత్రియ సంఘం ప్రతినిధులు తాము నేసిన ప‌ట్టు వ‌స్త్రాలు అంద‌జేసి స‌త్కరించారు. ఇది నాకు ద‌క్కిన అరుదైన గౌర‌వం. యువగళం పాదయాత్ర 58వరోజు ధర్మవరం నియోజకర్గం సీఎన్బీ క్యాంప్ సైట్ నుంచి మొద‌లు పెట్టాను. చేనేత కార్మికులు, బోయ సామాజికవర్గీయులు, జిల్లేడు బండ ప్రాజెక్టు నిర్వాసితులు న‌న్ను క‌లిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. చిత్రావతి నది ఉప్పలపాడు రీచ్ నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా క‌ళ్లారా చూశాను.’’ అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

Next Story