కన్నా పార్టీలోకి రావడం శుభపరిణామం: టీడీపీ అధినేత చంద్రబాబు

by Disha Web Desk 13 |
కన్నా పార్టీలోకి రావడం శుభపరిణామం: టీడీపీ అధినేత చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి, సీనియర్ పొలిటీషియన్ అయిన కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభపరిణామం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కన్నా లక్ష్మీనారాయణను తాను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కన్నాతో పాటు ముఖ్యమైన నాయకులు పార్టీలో చేరారు అని చెప్పుకొచ్చారు. అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణకు ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పుకొచ్చారు.

జాతీయ స్థాయిలో విద్యార్థి నాయకుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా, మంత్రిగా, పలువురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు అని గుర్తు చేశారు. కన్నాను పెదకూరపాడులో ఓడించాలని చూశాం కానీ టీడీపీ వల్ల కాలేదు అంతటి గొప్ప నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో సైకో పాలన పోవాలనే అందరిని కలుపుకొని ముందుకు పోతున్నాం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed