టీడీపీ, జనసేన మేనిఫెస్టో విడుదల.. రైతులకు భారీ గుడ్ న్యూస్

by Disha Web Desk 12 |
టీడీపీ, జనసేన మేనిఫెస్టో విడుదల.. రైతులకు భారీ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ కీలక నేతలు కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కీలక అంశాలను మీడియాకు వివరించారు. ఈ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు.. రైతులకు ఏటా రూ. 20,000 వేల పెట్టుబడి సాయం అందించనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే ఈ మేనిఫెస్టో తో బీజేపీకి సంబంధం లేదని.. ఇది కేవలం జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోనని.. దీనికి బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని బాబు చెప్పుకొచ్చారు. నేషనల్ పార్టీ అయిన బీజేపీ రాష్ట్రంలో స్పెషల్ మేనిఫెస్టో ఉండదని బాబు క్లారిటీ ఇచ్చారు.

Next Story

Most Viewed