వైసీపీ మేనిఫెస్టోలో 99శాతం హామీలు మోసం.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

by Dishafeatures2 |
వైసీపీ మేనిఫెస్టోలో 99శాతం హామీలు మోసం.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలపై టీడీపీ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం విడుదల చేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాయలంలో ‘ప్రకాశించని నవరత్నాలు-జగన్ మోసపు లీలలు’ పేరుతో టీడీపీ వాస్తవపత్రం విడుదల చేసింది. వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం అవాస్తవం అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పాదయాత్ర హామీలు 10 శాతం కూడా అమలు చేయలేదు అని ఆరోపించారు. నవరత్నాల హామీల్లో 25 శాతం కూడా అమలు చేయలేదు అని ధ్వజమెత్తారు. ఫేక్ సీఎం ఫేక్ మాటలు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద 12 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదు అని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 8 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు అని చెప్పుకొచ్చారు.

పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో 2 అమలు కాలేదు అని మండిపడ్డారు. అమ్మఒడి కింద ఇచ్చిన 2 హామీల్లో రెండూ అమలు కాలేదు అని విమర్శించారు. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5 హామీల్లో 5 అమలు కాలేదు అని చెప్పుకొచ్చారు. బోధనారుసుం కింద ఇచ్చిన 2 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు అని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ జలయజ్ఞం కింద ఇచ్చిన 3 హామీలకు 3 పెండింగ్‍లోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. మద్యనిషేధమంటూ ఇచ్చిన ఒక్క హామీ ఇంతవరకు అమలుకాలేదు అని చెప్పుకోచ్చారు. వైఎస్ఆర్ ఆసరా, చేయూత కింద 4 హామీల్లో 4 పెండింగ్‍లోనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మందుల కొరత లేకుండా చేశాం.. నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందుతుందా? అని నిలదీశారు. జగన్ చెప్పేవన్నీ అసత్యాలే.. ఒక్కటీ నిజం ఉండదు అని అచ్చెన్నాయుడు అన్నారు.


ఎన్నికల ముందు చెప్పేది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేసిందొకటి అని మండిపడ్డారు. అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామని.. రూ.13 వేలు ఇస్తారా? అని నిలదీశారు. రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు ఉంటే 42 లక్షల మందికే ఇస్తారా? అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కార్యక్రమం తీసుకొస్తాం అని చెప్పుకొచ్చారు. తల్లికి వందనం పేరుతో ప్రతి మహిళకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు. ఫించన్ రూ.200 ఉంటే రూ.1800 పెంచి రూ.2 వేలు ఇచ్చాం. మేం 74 లక్షల మందికి పింఛన్ ఇస్తే మీరు 62 లక్షల మందికి ఇస్తారా అని మండిపడ్డారు. మీరొచ్చి 10 లక్షల మందికి పింఛన్ తొలగించడం వాస్తవం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవేవో సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి మోసం చేస్తున్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed