Breaking: కేంద్రహోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ..

by Disha Web Desk 16 |
Breaking: కేంద్రహోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ..
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రహోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నేరుగా అమిత్ షాతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలో తెలంగాణ, ఏపీలో ఎన్నికలు జరగనుండటంతో పొత్తులపై అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆదివారం ఉదయం ప్రధాని మోదీతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీలో రాజకీయాలు, పొత్తులపైనా చర్చించే అవకాశం ఉంది. ఏపీలో జనసేన పార్టీతో బీజేపీ పొత్తులో ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల పవన్ కల్యాణ్ కూడా బీజేపీ అగ్రనేతలను కలిశారు. తాజాగా చంద్రబాబు కూడా అమిత్ షా, ప్రధాని మోదీతో భేటీ అవుతుండటంతో పొత్తులపై మూడు పార్టీలు ఓ అభిప్రాయానికి రానున్నట్లు స్పష్టమవుతోంది.


Next Story

Most Viewed