Ap Politics: బీజేపీ పెద్దలతో చంద్రబాబు వరుస భేటీలు అందుకేనా..?

by Disha Web Desk 16 |
Ap Politics: బీజేపీ పెద్దలతో చంద్రబాబు వరుస భేటీలు అందుకేనా..?
X

దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ కేంద్ర పెద్దల నుంచి చంద్రబాబుకు పిలుపొచ్చింది. కాసేపట్లో అమిత్​ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఆదివారం ఉదయం ప్రధాని మోడీతో టీడీపీ అధినేత భేటీ అవుతారు తెలంగాణలో టీడీపీ సహకారం అవసరమని బీజేపీ భావిస్తోంది. దీని గురించి చర్చించేందుకే బాబును పిలిపించినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఆంధ్రాలో పొత్తులూ ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఇచ్చినా సరే కీలకమైన 8 ఎంపీ స్థానాలు అడుగుతున్నట్లు సమాచారం. దీనిపై బాబు మల్లగుల్లాలు పడుతున్నారు. అంగీకరించినా క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ అంత తేలిక్కాదు. ఏపీ ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత ఎక్కడ కొంప ముంచుతుందోనన్న బెంగ మరోవైపు బాబును సందిగ్ధంలోకి నెడుతోంది. ఈ పరిణామాలన్నింటి మధ్య కమలనాధులతో బాబు భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Read more: లోకేష్‌కు ప్రాణహాని ఉంది.. డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ


Next Story

Most Viewed