మనం బానిసలం.. ఆయన రారాజు: సీఎం జగన్‌పై చంద్రబాబు సెటైర్లు

by Disha Web Desk 16 |
మనం బానిసలం.. ఆయన రారాజు: సీఎం జగన్‌పై చంద్రబాబు సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: మనం బానిసలం.. ఆయన రారాజు అని సీఎం జగన్ ఫీలింగ్ అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీ వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి కోసం తాను నెల్లూరు వచ్చానని చెప్పారు. అలాంటి వ్యక్తులను ఎవరూ కూడా వదులుకోకూడదని తెలిపారు. పార్టీలో వేమిరెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లా గెలుపు ఈజీ కాబోతోందని జోజ్యం చెప్పారు. సైకో జగన్ మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే వారి పని అయిపోయినట్టేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ చేసిన తప్పును చెప్పినందుకే ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదని చెప్పారు. 45 ఏళ్ల రాజకీయ జీవతం ఉన్న తన పట్ల సీఎం జగన్ ఎలా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని చంద్రబాబు మండిపడ్డారు.

Read More..

టీడీపీ-జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం!

Next Story

Most Viewed