Breaking: భారీ మెజార్టీలతో టీడీపీ అభ్యర్థుల గెలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-06-04 07:19:40  IST  )

ఏపీలో టీడీపీ అభ్యర్థుల విజయం కొనసాగుతోంది...

Breaking: భారీ మెజార్టీలతో టీడీపీ అభ్యర్థుల గెలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టీడీపీ అభ్యర్థుల విజయం ప్రారంభమైంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత బుచ్యయ్య చౌదరి గెలుపుతో బోణీ కొట్టగా తాజాగా మరో ఇద్దరు నేతలు విజయం సాధించారు. పాలకొల్లులో 63,463 వేల ఓట్ల మెజార్టీతో నిమ్మల రామానాయుడు గెలుపొందారు. అలాగే రాజమండ్రి సిటీలో 65,500 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆదిరెడ్డి వాసు విజయం సాధించారు. ఇక నిమ్మల రామానాయుడు వరుసగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టారు. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల పోలింగ్‌కు తాజాగా లెక్కింపు జరుగుతోంది. ఈ లెక్కింపులో టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు.

Next Story