Swandhra: స్వర్ణాంధ్ర సాధనకు.. టాస్క్​ఫోర్స్​

by Thanuru Gopichand |

స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Swandhra: స్వర్ణాంధ్ర సాధనకు.. టాస్క్​ఫోర్స్​
X

= చైర్మన్​గా సీఎం చంద్రబాబు నాయుడు

= పారిశ్రామిక అభివృద్దికి బ్లూ ప్రింట్​

దిశ, డైనమిక్​ బ్యూరో : స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఏపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.ఈ క్రమంలో స్వర్ణాంధ్ర సాధన కోసం ఓ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఈ టాస్క్​ఫోర్స్ (TaskForce) ​ఏర్పాటు కానుంది. కో చైర్​పర్సన్​గా టాటా సన్స్​చంద్రశేఖరన్​వ్యవహరించనున్నారు. టాస్క్​ఫోర్స్​సభ్యులుగా సీఐఐ డీజీ చంద్రజిత్​బెనర్జీ, అపోలో ఆస్పత్రి వైస్​చైర్​పర్సన్​ప్రీతారెడ్డి, సుచిత్ర ఎల్లా, ప్రొఫెసర్​ రాజ్​రెడ్డి, సతీష్​రెడ్డి, జీఎం రావు , ఎల్​ఎండ్ టీ చైర్మన్​సుబ్రహ్మణ్యన్​, ఏపీ సీఎస్​విజయానంద్​ ఉంటారు. స్వర్ణాంధ్ర 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ఈ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అభివృద్ధికి బ్లూప్రింట్​తయారు చేసేలా ఈ టాస్క్​ఫోర్స్​పనిచేయనుంది. పారిశ్రామిక అవసరాలను అనుగుణంగా ఈ బ్లూ ప్రింట్​ను రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చూస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

Next Story