చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం.. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

by Disha Web Desk 6 |
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం.. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్‌ కావాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఒక కార్యకర్తగా కష్టపడతానని తెలిపారు.

ఇందులో భాగంగా నెల్లూరులో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు, అనుచరులతో కలిసి పర్యటించారు. భవిష్యత్‌లో అందరినీ కలుపుకుని పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్పష్టం చేశారు.


Next Story

Most Viewed