అధికారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు

by Vemula.Srinu Prasad |

అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు..

అధికారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్: అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) బిగ్ అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు. బాగా పని చేయని అధికారులను ప్రజల ముందే నిలదీస్తామని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి ప్రజలు మెచ్చే పాలన చేయాలని సూచించారు. ఎమ్మెల్యేలు బాగా పని చేయాలని, లేనిపక్షంలో మొహమాటం లేకుండా నిలదీస్తానని వార్నింగ్ ఇచ్చారు. పథకాల అమలుకు టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. పెన్షన్ పంపిణీని రియల్ టైమ్ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. కొంతమంది అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని చెప్పారు. బాగా పని చేస్తున్న అధికారులను తాను అభినందిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. వర్క్ చేయని అధికారులతో పని చేయిస్తానని, అది తన బాధ్యత అని సీఎం చంద్రబాబు చెప్పారు.

Next Story