- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం కుంభకోణం కేసు.. రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది.

దిశ, వెబ్డెస్క్: మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసు విచారణలో తాము జోక్యం చేసుకోలేమని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. మద్యం కుంభకోణం కేసులో జోక్యం చేసుకుని తనకు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణ ఈ దశలో ఉన్నపుడు జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ.. బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికోట్లు సంపాదించారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది.
కెసిరెడ్డినే కేంద్ర బిందువుగా ఉన్నారని. మొత్తం వ్యవహారానికీ ఆయనే కుట్రదారుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. రూ.700 కోట్లకు పైగా కుంభకోణంలో 9 నెలలపాటు జైల్లో ఉండటం అనేది చాలా చిన్నవిషయమని, ఇది ఎక్కువకాలమేమీ కాదని వ్యాఖ్యానించింది. తాము పూర్తిస్థాయి వాదనలు వినిపించేందుకు సమయం కావాలని కెసిరెడ్డి తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరడంతో.. తదుపరి విచారణను సీజేఐ ధర్మాసనం 12వ తేదీకి వాయిదా వేసింది.






