Big Shock: వైఎస్ భాస్కర్‌రెడ్డికి నోటీసులు

by srinivas |
Big Shock: వైఎస్ భాస్కర్‌రెడ్డికి నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు(Ys Vivekananda Reddy murder case)లో నిందితుడు భాస్కర్ రెడ్డి(Bhaskar Reddy)కి సుప్రీంకోర్టు(Supreme Court)నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వైఎస్ సునీత(YS Sunitha) దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం(CJI Justice Sanjeev Khanna Bench) శుక్రవారం విచారించింది. ఈ కేసు ప్రతివాదులతో పాటు సీబీఐకూ నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వద్దంటూ గతంలో దాఖలు చేసిన సీబీఐ పిటిషన్‌నూ, సునీత పిటిషన్‌ను ఈ నోటీసులకు జత చేసింది. విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది.

కాగా వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే ఆయనకు తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బెయిల్ మంజూరు చేయడంతో సుప్రీంకోర్టులో సీబీఐ సవాల్ చేసింది. భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని పిటిషన్ దాఖలు చేసింది. సునీత పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో సీబీఐ(CBI) పిటిషన్‌ను జత చేస్తూ భాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed