AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు : సుప్రీంలో ఆ ముగ్గురికి చుక్కెదురు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-05-05 08:09:11  IST  )

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) అరెస్ట్ నుంచి మినహాయింపు కోరుతూ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించిన ముగ్గురికి చుక్కెదురయింది.

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు : సుప్రీంలో ఆ ముగ్గురికి చుక్కెదురు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Scam Case) అరెస్ట్ నుంచి మినహాయింపు కోరుతూ మధ్యంతర బెయిల్ కోసం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించిన ముగ్గురికి చుక్కెదురయింది. ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, బాలాజీలకు ఈ విషయంలో ఊరట దక్కలేదు. ఈ నెల 7వ తేదీన ఏపీ హైకోర్టులో (AP High Court) లిక్కర్ కేసు విచారణ ఉండటంతో.. ప్రస్తుతం ఎలాంటి విచారణ చేయలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం కుదరదని తేల్చేసింది. హైకోర్టు విచారణ తర్వాతే అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడంపై మరోసారి విచారణ చేస్తామని పేర్కొంది. 7వ తేదీన హైకోర్టు సరైన ఆర్డర్ ఇస్తుందన్న నమ్మకం తమకు ఉందని చెప్తూ.. తదుపరి విచారణను మే8వ తేదీకి వాయిదా వేసింది.

Next Story