- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరీక్ష రాయవద్దన్నాడని.. ప్రొఫెసర్ను కత్తితో పొడిచిన విద్యార్థి..
పరీక్ష రాయవద్దన్నాడని.. చదువు నేర్పే గురువును ఓ విద్యార్థి కత్తితో పొడిచాడు.

ఏపీ ట్రిపుల్ఐటీలో దారుణం
దిశ, డైనమిక్ బ్యూరో : పరీక్ష రాయవద్దన్నాడని.. చదువు నేర్పే గురువును ఓ విద్యార్థి కత్తితో పొడిచాడు. ఈ ఘటన ఏపీలోని నూజివీడు ట్రిపుల్ఐటీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వినయ్పురుషోత్తం అనే విద్యార్థి ఏలూరు జిల్లా నూజి వీడు ట్రిపుల్ఐటీలో ఫస్టియర్ఎంటెక్ చదువుతున్నాడు. వినయ్ సక్రమంగా క్లాసులకు హాజరు కాకపోవటంతో నేడు ల్యాబ్ ఎగ్జామ్ రాయ వద్దని ప్రొఫెసర్ ఎస్ ఎస్ వి గోపాల్ రాజు తెలిపాడు. ఎగ్జామ్ రాయాలంటే హెచ్వోడీ పర్మిషన్ తీసు కోవాలని సూచించాడు. దీంతో ఆగ్రహించిన వినయ్రెండు కత్తులతో ప్రొఫెసర్ పై దాడి చేశాడు. తోటి విద్యార్థుల అడ్డుకోవడంతో ప్రొఫెసర్కు స్వల్ప గాయాలయ్యాయి. పక్క ప్రణాళికతోనే కత్తితో దాడి చేశారని ప్రొఫెసర్ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేసే దర్యాప్తు చేపడుతున్నారు.






