స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి.. విధులకు హాజరై ఒక్కసారిగా కుప్పకూలిన డీజీఎం

by Dishanational2 |
స్టీల్ ప్లాంట్ ఉద్యోగి మృతి.. విధులకు హాజరై ఒక్కసారిగా కుప్పకూలిన డీజీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్‌లో డీజీఎం టీవీవీ ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించడం సంచలనంగా మారింది. ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ విభాగంలో డీజీఎంగా పనిచేస్తున్న టీవీవీ ప్రసాద్ సోమవారం ఉదయం డ్యూటీకి హాజరయ్యారు. థర్డ్ ఫ్లోర్‌లోని తన రూంకు నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.దీంతో సహ ఉద్యోగులు ప్రసాద్‌ను స్టీల్ ప్లాంట్ జనరల్ ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ప్రసాద్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయారని నిర్ధారించారు. ఈ ఘటనపై డిప్యూటీ డీజీఎం సహదేవ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైద్యుల నివేదిక ఆధారంగా విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.ఇకపోతే టీవీవీ ప్రసాద్ 1995లో మేనేజ్ మెంట్ ట్రైనీగా స్టీల్ ‌ప్లాంట్‌లో చేరారు. ప్రస్తుతం డీజీఎం గా పనిచేస్తున్నారు. ఇకపోతే సోమవారం ఉదయం జనరల్ షిఫ్ట్ లో ప్రసాద్ విధులకు హాజరై ఇలా మృత్యువాతపడ్డారు. దీంతో స్టీల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed