ఏపీలో రూ.లక్షకోట్లకు పైగా పెట్టుబడులకు SIPB ఆమోదం

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ లో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదం తెలిపింది.

ఏపీలో రూ.లక్షకోట్లకు పైగా పెట్టుబడులకు SIPB ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ SIPB సమావేశంలో ఈ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో 85,870 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్లస్టర్ వారీగా పారిశ్రామిక అభివృద్ధి చేపడుతామన్నారు. విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సు కంటే ముందే వివిధ పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తామన్నారు. 3 మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లను అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

Next Story