మంత్రి బుగ్గన పర్యటనలో అపశృతి.. 70మందిపై తేనెటీగల దాడి

by Dishafeatures2 |
మంత్రి బుగ్గన పర్యటనలో అపశృతి.. 70మందిపై తేనెటీగల దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. తేనెటీగలు దాడి చేశాయి. ఈ తేనెటీగల దాడి నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కనుమకింద కొట్టాలలో బుధవారం మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు.

ఓ ప్రాంతంలో చెట్టు వద్ద పనులను మంత్రి పరిశీలిస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు రెచ్చిపోయాయి. వీరిపై దాడి చేశాయి. ఈ దాడిలో 70 మంది వరకు అధికారులు, అధికార పార్టీ నాయకులు గాయపడ్డారు. అయితే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సిబ్బంది సురక్షితంగా అక్కడ నుంచి తప్పించారు.

Next Story

Most Viewed