Srisailam: శ్రీశైలం ఆలయానికి కొత్త ఈవో.. బాధ్యతలు స్వీకరణ

by Ramesh Goud |   (  Updated:2024-11-18 12:05:15  IST  )

శ్రీశైలం దేవస్థానం(Srisailam Devasthanam) నూతన ఈవో(EO) గా నియమితులైన ఎస్.ఎస్ చంద్రశేఖర్ ఆజాద్(S.S. Chandrasekhar Azad) ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Srisailam: శ్రీశైలం ఆలయానికి కొత్త ఈవో.. బాధ్యతలు స్వీకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీశైలం దేవస్థానం(Srisailam Devasthanam) నూతన ఈవో(EO) గా నియమితులైన ఎస్.ఎస్ చంద్రశేఖర్ ఆజాద్(S.S. Chandrasekhar Azad) ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో శ్రీశైలం ఈవోగా ఉన్న పెద్దిరాజు(Peddiraju)ను కూటమి ప్రభుత్వం(NDA Govt) బదిలీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి(Chandrashekar Reddy)ని శ్రీశైలం ఆలయానికి ఇంచార్జ్ ఈవోగా నియమించింది. అయితే మూడు రోజుల క్రితం రాయలసీమ ఆర్ జేసీగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ ను శ్రీశైలం దేవస్థానానికి పూర్తి స్థాయి ఈవోగా నియమిస్తు దేవదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇవాళ శ్రీశైలం చేరుకున్న ఆయన.. మల్లిఖార్జున స్వామి(Mallikharjuna Swami) సహా అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి కొత్త ఈవోగా పదవీ బాధ్యతలు(Charged) స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Next Story