SRISAILAM: రేపటి నుంచి శ్రీశైల క్షేత్ర మహ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

by Disha Web Desk 1 |
SRISAILAM: రేపటి నుంచి శ్రీశైల క్షేత్ర మహ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైల బ్రమరాం సమేత మల్లికార్జుల స్వామి ఆలయ మహా శివరాత్రి సందర్భంగా రేపటి నుంచి మార్చి 11 వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసేంత వరకు ఆలయంలో ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తీవ్ర రద్దీ కారణంగా స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఈవో పెద్దిరాజు తెలిపారు. 8న పాగాలంకరణ, కల్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కేవలం శివ స్వాములకు మాత్రమే 1 నుంచి 5 తేదీ సాయంత్రం వరకు నిర్దిష్ట వేళల్లో ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. బ్రహ్మోత్సవా సందర్భంగా భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతి శీఘ్రదర్శనానికి ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌కి ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వహకులు తెలిపారు.



Next Story

Most Viewed