పున్నయ్య స్వామిని విజయసాయి రెడ్డి చంపేస్తామన్నారు.. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి

by Dishafeatures2 |
పున్నయ్య స్వామిని విజయసాయి రెడ్డి చంపేస్తామన్నారు.. ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి
X

దిశ, ఉత్తరాంధ్ర: కొందరు నాయకులు కుట్రలతోనే జ్ఞానానంద ఆశ్రమం పున్నయ్య స్వామి పై లైంగిక దాడి ఆరోపణలు చేస్తున్నారని ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతీ స్వామి పేర్కొన్నారు. విశాఖపట్నం కొత్త వెంకోజీపాలెంలో ఉన్న రామానంద, జ్ఞనానంద ఆశ్రమానికి విచ్చేసి మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా ఇక్కడి భూములు ఆక్రమించడానికి ప్రయత్నాలు జరిగాయన్నారు. అందులో భాగంగానే వైసీపీ నేత విజయసాయి రెడ్డి స్వామిని చంపేస్తాను అని బెదిరించారు అని గుర్తు చేశారు. ఇక్కడి బాలిక అదృశ్యంపై పోలీసు ఫిర్యాదు చేశారు అన్నారు. ఇంతలో ఈ ఆరోపణలు వెనుక బలమైన కుట్ర ఉంది అన్నారు. ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఉంటున్న స్వామీజీకి సంబంధించి నడుస్తున్న వివాదంపైన కొందరు రాద్దాంతం చేస్తున్నారు అని మండి పడ్డారు.

అసలు ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నారు. రూ.కోట్లు విలువ చేసే భూముల ఆక్రమణ కోసమే కొన్ని రాబందులు నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఇక్కడి స్వామి, పిల్లలు, సిబ్బందిని బెదిరించడం, ఆవులు తరలించడం చేస్తున్నారని తెలిపారు. తమను ఆశ్రమంలో అడుగు పెట్టకుండా పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. ఇదేమైనా పాకిస్తానా అని అసహనం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో స్వామీజీలు, ఆర్ఎస్ఎస్ సంఘటన జాతీయ అధికార ప్రతినిధి తురగా శ్రీరామ్, బీజేపీ నాయకులు రామచంద్రమూర్తి, ఫణీంద్ర, ఇతర హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed